Saturday, June 7, 2025
ads
Homeతాజా సమాచారంరాష్ట్రీయ మిలటరీ పాఠశాలకు విద్యార్థి ఎంపిక

రాష్ట్రీయ మిలటరీ పాఠశాలకు విద్యార్థి ఎంపిక

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండలంలోని జామిడి గ్రామానికి చెందిన పాన్ పట్టే సుధాకర్, అశ్విని దంపతుల కుమారుడు ప్రజ్ఞయ్ రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలకు ఎంపికయ్యాడు. ఈ విద్యార్థి ఇచ్చోడ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నాడు. దేశంలో రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలలు ఐదు ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో నిర్వహిం చిన ఆరవ తరగతి ప్రవేశానికి ప్రజ్ఞయ్ పరీక్ష రాసాడు. రెండు రోజుల క్రితమే ప్రవేశ పరీక్షల ఫలితాలు వెలు వడ్డాయి. ఫలితాల్లో ప్రజ్ఞయ్ ప్రతిభ కనబర్చి అర్హత సాధించాడు. బెంగళూరులోని రాష్ట్రీయ మిలటరీ పాఠశాలకు ఎంపికైనట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలకు మండలానికి చెందిన విద్యార్థి ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి తండ్రి సుధాకర్ గ్రామంలో వ్యవసాయం చేస్తూ, ఇచ్చోడలో టెంట్ హౌస్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments