వాస్తవ నేస్తం,బోనకల్: తెలంగాణ జన సమితి ఖమ్మం జిల్లా ప్లీనరీని జయప్రదం చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావుఅన్నారు. శుక్రవారం శుక్రవారం
ఏర్పాటు చేసిన విలేకరుల ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆకాంక్షల కోసం ఏర్పడిన తెలంగాణ జన సమితి మూడో ప్లీనరీని ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్లో ఫిబ్రవరి 2న నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం హాజరు కానున్నారని, ఈ ప్లీనరీలో జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై పోరాడేందుకు తీర్మానాలు చేయబడతాయనీ, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్లీనరీని జయప్రదం చేయాలని వారు కోరారు. ఎన్నో ఏండ్లుగా మండల ప్రజలు ఎదురుచూస్తున్న శాతవాహన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను బోనకల్ స్టేషన్ నందు ఆపేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలొ ఇచ్చిన హామీని అమలు చేయాలనీ, అలాగే 250 గజాల స్థలాన్ని కేటాయించి, ఉదమకారులకు పెన్షన్ అమలు అయ్యే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని బోనకల్ తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్, బాబు, జిల్లా ప్రదాన కార్యదర్శి సర్దార్,నాగేందర్రావు, నరసింహారావు, మోహన్, ఉద్యమకారులు గిద్దగిరి సత్యనారాయణ, గిడుగు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, బీరెల్లి వాసు, బీరెల్లి కృష్ణ, తాళ్లూరి శ్రీనివాసరావు, గూడ పాండురంగ శాస్త్రి, పుల్లఖండం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
