వాస్తవ నేస్తం,బోథ్: మండల కేంద్రంలో గల కొట్టాల పోచమ్మ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం వైభోగంగా జరిగింది. బోథ్ పట్టణ పురువిధులగుండా భాజభజంత్రిలు, డప్పు చెప్పుల్ల మధ్య విగ్రహలను భక్తి శ్రద్ధాలతో శోభయాత్ర నిర్వహించారు. నేడు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహిస్తామని, శనివారం విగ్రహాల ప్రతిష్టపన చేసిన అనంతరం మహా అన్నప్రసాదం ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
