Friday, March 14, 2025
ads
Homeగాడ్జేట్స్తెలంగాణ భవన్ లో జరిగిన సిర్పూర్ కాగజ్ నగర్...

తెలంగాణ భవన్ లో జరిగిన సిర్పూర్ కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్

సిర్పూర్ కాగజ్ నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు కోపంగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు నాయకులు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కొడతారు.
ముఖ్యమంత్రి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదు.
ప్రజలు తిడుతున్న తిట్లకి రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు.
తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నరు.
ఇంత దుర్మార్గమైన పాలన చేయాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఏమున్నదో ఆలోచించుకోవాలి.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల మనుషులె కానీ చేతల ప్రభుత్వం కాదు అని అర్థమైంది.
తెలంగాణ నలుమూలలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా వ్యతిరేకత నెలకొని ఉంది.
140 ఎకరాల భూముల కోసం కొడంగల్ లోని ఒక ఊరికి 450 మంది పోలీసులను సీఎం పంపించడం జరిగింది.
తెలంగాణలో పేదవాళ్లు బతక వద్దా? వాళ్ళ ఇల్లులను దుకాణాలను రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు.
మీకు 10 సంవత్సరాల పాటు తెలంగాణలో పేదవాళ్ల గురించి ఆలోచించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ చేసిండు.
400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన పార్టీ కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కారం
అధికారం లేకుండా అర్ధ రూపాయి డబ్బులు ఇవ్వకుండా 400 కిలోమీటర్లు కేసీఆర్ గారి మీద ప్రేమతో హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్క సోదర సోదరీమణునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం.
కానీ మీ అందరికీ అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుకు వెళ్తాడు…కేసీఆర్ కూడా తప్పకుండా తిరిగి ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తారు.
సిర్పూర్ కాగజ్ నగర్ తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉన్నది. 2006 నుంచి 2009 వరకు అక్కడ పార్టీ బలోపేతం కోసం పని చేసిన. 2009లో శాసనసభ ఎన్నికల్లో పార్టీ గెలిచింది. రాష్ట్రంలో పది సీట్లు మాత్రమే గెలిచినా సిర్పూర్ కాగజ్ నగర్ లో కూడా గులాబీ జెండా ఎగిరింది.
కాగజ్ నగర్ లో ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో అక్కడ ఉన్న ఏకైక పరిశ్రమ కాగజ్నగర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేసిన.
పేపర్ మిల్లును ఓపెన్ చేసేందుకు ముంబాయి, కలకత్తా వంటి అనేక ప్రాంతాల్లో పర్యటించి అనేక కంపెనీలను కలిసి జేకేతో మాట్లాడి పేపర్ మిల్లును తిరిగి ఓపెన్ చేయించడం జరిగింది.
అధికారం కోసం పార్టీలు మారే అవకాశవాదుల గురించి మాట్లాడాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు.
ప్రతిపక్షంలో ఉన్న మన పార్టీతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.
తెలంగాణ సమాజం గురించి… తెలంగాణ అభివృద్ధి గురించి భవిష్యత్తు తెలంగాణ గురించి ప్రవీణ్ కుమార్ గారి ఆలోచనలు నా ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి.
అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన అనేక అవకాశాలను, పదవులను వదులుకొని బహుజన అభివృద్ధి కోసం మన పార్టీలో చేరడం జరిగింది.
కేసీఆర్ గారితోనే బహుజనుల అభివృద్ధి జరుగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నమ్మారు.
8 మంది చొప్పున కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచినా తెలంగాణకు తెచ్చింది… దక్కింది శూన్యం.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా.. ఒక్క కాంగ్రెస్, బీజేపీ ఎంపీ నోరు మెదపలేదు.
కానీ లోక్ సభలో గులాబీ దండు ఉండుంటే కేంద్రంపై కొట్లాడుతుండే.
సిర్పూర్ కాగజ్ నగర్ ను మహారాష్ట్రలో కలపమని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే సోయిలేకుండా మాట్లాడుతున్నాడు.
కాగజ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మనసులో ఉన్న మాట నాకు అర్థమైంది. ఇదే విషయాన్ని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను.
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలి.
బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలి.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ కార్యకర్తలు పనిచేసి అద్భుతమైన ఫలితాలను సాధించాలి.
కాగజ్ నగర్ లో కమిట్మెంట్ ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు.
కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాల్లో గులాబీ జెండా ఎగరాలి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments