భారత ములవాసుల ఫోరం(NIEU) ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గా రాహుల్*
సంగారెడ్డి- భారత మూల వాసుల ఫోరం ఎంప్లాయిస్ యూనియన్(NIEU) జిల్లా అధ్యక్షులుగా సంగారెడ్డి పట్టణానికి చెందిన ఎం. రాహుల్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు బీరయ్య యాదవ్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలోని ములవాసుల అభివృద్ధి, వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి చేస్తుందని అన్నారు. యువతలో చైతన్యం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్, సభ్యులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.*