అమరావతి : ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి పీయూస్ గోయల్ ప్రయాణించే హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో తన పర్యటనను అర్దంతరంగా రద్దు చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని అమరావతి నుంచి హెలికాప్టర్లో తిరుపతికి వెళ్లిన కేంద్ర మంత్రి అక్కడ పర్యటనను పూర్తి చేసుకున్నారు. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కారు.
అదే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ సిబ్బంది కేంద్ర మంత్రి గోయల్ భద్రత సిబ్బందికి వివరించారు. దీంతో ముందు జాగ్రత్తగా తన కృష్ణ పట్నం పర్యటనను రద్దు చేసుకుని తిరుపతి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు జీఎంఆర్ సంస్థకు చెందిన హెలికాప్టర్ వాడుతున్నారు. ఇదే హెలికాప్టర్ను కేంద్ర మంత్రికి వినియోగించారు.
ఈ హెలికాప్టర్లో తరుచూ సాంకేతిక సమస్యలు వస్తుండడంతో ఏపీ డీజీపీ హరీష్కుమర్ గుప్తా విచారణకు ఆదేశించారు. భవిష్యత్లో ఈ హెలికాప్టర్ వినియోగించవచ్చా లేదా స్పష్టంగా నివేదిక ద్వారా తెలియజేయాలంటూ ఇంటెలిజెన్స్ చీఫ్కు డీజీపీ లేఖ రాశారు.