Monday, June 16, 2025
ads
Homeగాడ్జేట్స్ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌..

ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌..

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో ఏసీబీ విచారణకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. ఆయనతోపాటు మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌ రావు కూడా విచారణకు హాజరయ్యారు. అంతకుముందు నందీనగర్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫార్ములా వన్‌ విచారణకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ భేటీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు కూడా పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులతో భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన నుంచి నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలనికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కార్యాలయం గేటు వద్దే బీఆర్‌ఎస్‌ నాయకులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్‌ శ్రే ణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసుల తీరుపై ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments