సత్యమేవ జయతే- కొండాపూర్
కొండాపూర్ : ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి కొండాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆధార్ కేంద్రం వారం రోజులపాటు నిర్వహించి కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విద్యార్థులకు యువకులకు ప్రతి ఒక్కరికి ఆధార్లో ఎలాంటి సమస్యలు ఉన్న అప్డేట్ చేసుకోవచ్చని చిన్న పిల్లలకి కొత్త ఆధార్ కార్డులు కూడా తీసుకోవచ్చని ఫినో పేమెంట్స్ బ్యాంకు నిర్వాహకుడు జే .భాస్కర్ తెలిపారు. ఈ ఆధార్ సేవ కేంద్రం ఫినో పేమెంట్స్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని. కావున ఈ ఆధార్ సేవలు వారం రోజులు మాత్రమే అందిస్తామని కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.