Saturday, June 7, 2025
ads
Homeజాతియంఈ-పాస్‌పోర్ట్‌ వచ్చేసింది!

ఈ-పాస్‌పోర్ట్‌ వచ్చేసింది!

ఢిల్లీ : భారత పాస్‌పోర్ట్‌ వ్యవస్థను ఆధునీకరణలో భాగంగా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పాస్‌పోర్ట్‌ సేవా ప్రోగ్రామ్‌ (పీఎస్పీ) వెర్షన్‌ 2.0లో భాగంగా ఈ-పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 2024 ఏప్రిల్‌ 1న ప్రారంభమైన పీఎస్పీ పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నది. పాస్‌పోర్ట్‌ల భద్రతను మెరుగుపరచడం, ఇంటర్నేషనల్‌ ప్రయాణాలను స్ట్రీమ్‌లైన్‌ చేయడం, నకిలీ, ట్యాంపరింగ్‌ నుంచి పాస్‌పోర్ట్‌ హోల్డర్ల వ్యక్తిగత డాటాను సంరక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం

ఏమిటీ ఈ-పాప్‌పోర్ట్‌?
ఇది సంప్రదాయ పేపర్‌ డాక్యుమెంట్‌ వంటిదే. ఈ-పాస్‌పోర్ట్‌ కవర్‌పై బంగారు వర్ణపు చిన్న సింబల్‌ ఉంటుంది. సంప్రదాయ పాస్‌పోర్ట్‌లకు భిన్నంగా ఇందులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీతో ఈ-పాస్‌పోర్ట్‌ అనుసంధానమై ఉంటుంది. పాస్‌పోర్ట్‌ కవర్‌లో చిప్‌, యాంటెన్నా పొందుపరిచి ఉంటాయి. ఈ చిప్‌లోనే పాస్‌పోర్ట్‌ హోల్డర్ల వ్యక్తిగత, బయోమెట్రిక్‌ డాటా తదితర కీలకమైన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. తద్వారా అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో అథెంటికేషన్‌ సులభతరం అవుతుంది.

ఏయే నగరాల్లో అందుబాటులో…
ప్రస్తుతం ఈ-పాస్‌పోర్ట్‌ సేవలు హైదరాబాద్‌ సహా 13 నగరాల్లో మాత్రమే అందుతున్నాయి. అయితే, ఈ ఏడాది ప్రథమార్థం ముగిసే నాటికి దేశంలోని అన్ని పాస్‌పోర్ట్‌ కేంద్రాల్లో ఈ సేవ లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

నగరాలు: హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, భువనేశ్వర్‌, జమ్ము, గోవా, సిమ్లా, రాయ్‌పూర్‌, అమృత్‌సర్‌, జైపూర్‌, చెన్నై, సూరత్‌, రాంచీ, ఢిల్లీ

అప్‌గ్రేడ్‌ చేసుకోవాలా?
ఇప్పటికే పాస్‌పోర్ట్‌ ఉన్నవారు కచ్చితంగా అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పాస్‌పోర్ట్‌లు వాటి ఎక్స్‌పైరీ డేట్‌ వరకు సేవలందిస్తాయి. ఈ-పాస్‌పోర్ట్‌ అప్‌గ్రేడ్‌ అనేది ఆప్షనల్‌ మాత్రమే.

ఈ-పాస్‌పోర్ట్‌ వల్ల లాభాలు
– భద్రత మెరుగుపడుతుంది. నకిలీ, ఫోర్జరీ, వ్యక్తిగత సమాచారం చోరీ నుంచి ఇందులో ఉండే డిజిటల్‌ సంతకంతో కూడిన చిప్‌ రక్షణ కల్పిస్తుంది.
– అంతర్జాతీయ ప్రయాణాల సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో ఉండే చిప్‌ సాయంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చాలా తక్కువ సమయంలో అథెంటికేషన్‌ చేయగలుగుతారు. సరిహద్దుల్లో తనిఖీలు వేగవంతమవుతాయి.
– చిప్‌లో స్టోర్‌ చేసిన సున్నితమైన డాటాను ఇందులోని పబ్లిక్‌ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (పీకేఐ)ఎన్‌క్ట్రిప్ట్‌ చేస్తుంది. తద్వారా ఆ డాటాను ఎవరూ యాక్సెస్‌ చేయలేరు. అన్‌ఆథరైజ్డ్‌ వర్గాలు అందులోని సమాచారాన్ని మార్చలేవు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments