Saturday, June 7, 2025
ads
Homeక్రైమ్70 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ హైదరాబాద్‌ ఇన్‌కంట్యాక్స్‌...

70 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ హైదరాబాద్‌ ఇన్‌కంట్యాక్స్‌ కమిషనర్‌

సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ :
డబ్బు లక్షల రూపాయల లంచం తీసుకున్న కేసులో హైదరాబాద్‌ ఇన్‌కం ట్యాక్స్‌ కమిషనర్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి లావుడ్య జీవన్‌లాల్‌నాయక్‌ను సీబీఐ అధికారులు శనివారం అరెస్టు చేశారు. ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు సంబంధించిన ఒక ట్యాక్స్‌ అప్పీల్‌ కేసు కోసం జీవన్‌లాల్‌ నేతృత్వంలో ఇన్‌కంట్యాక్స్‌ బృందం అక్కడికి వెళ్లింది. ఆ కేసు తీవ్రతను తెలుసుకున్న జీవన్‌లాల్‌ బృందం రూ. 70 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది.

ఈ విషయంపై బాధిత వ్యక్తులు సీబీఐని ఆశ్రయించగా, ఈనెల 9న మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశారు. మధ్యవర్తిగా ఉన్న సాజిదా మజ్హర్‌ హుస్సేన్‌ షాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్‌ వచ్చిన ముంబై సీబీఐ అధికారులు ఈ కేసులో ప్రధాన సూత్రధారుడిగా ఉన్న జీవన్‌లాల్‌ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. జీవన్‌లాల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ ఇన్‌కం ట్యాక్స్‌ (ఎగ్జంప్షన్‌) కమినర్‌గా, అప్పీల్‌ యూనిట్స్‌ 7,8కు ఇన్‌కంట్యాక్స్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జీవన్‌లాల్‌తో పాటు ముంబైలోని షాపూర్‌ జీ పల్లోంజీ గ్రూప్‌లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (పన్నులు) ఉద్యోగి వైరల్‌ కాంతిలాల్‌ మెహతా, శ్రీకాకుళానికి చెందిన సైరాం పలిశెట్టి, వైజాగ్‌కు చెందిన నట్ట వీరనాగ శ్రీరామ్‌ గోపాల్‌, ముంబైకి చెందిన సాజిదా మజహర్‌ హుస్సేన్‌ షాను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.

ఏకకాలంలో 18చోట్ల తనిఖీలు

ఈ కేసులో మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా 18చోట్ల తనిఖీలు చేపట్టారు. ముంబై, హైదరాబాద్‌, ఖమ్మం, విశాఖపట్నం, న్యూఢిల్లీలలో సోదాలు చేశారు. సుమారు రూ. 69 లక్షలు నగదు సహా వివిధ నేరపూరిత పత్రాలు/వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో అరెస్టు చేసిన వారిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చినట్టు సీబీఐ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అరెస్టు చేసిన వారిని సంబంధిత న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టారు. సీబీఐ సోదాలు, అరెస్టులపై షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ స్పందించింది. ఈ కేసులో వారి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ అరెస్టు కావడంతో అంతర్గత విచారణ ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని సీబీఐ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments