సత్యమేవ జయతే – సంగారెడ్డి
సంగారెడ్డి : పాకిస్తాన్ కాల్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాo సత్య సాయి జిల్లా కగోరంట్ల మండలం కల్లి తండకు చెందిన మురళి నాయక్ భారతదేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు వీరమరణం పొందిన ఆర్మీ సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడికి ఆత్మకు శాంతి చేకూరాలని గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఐబి నుండి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ మాట్లాడుతూ దేశాన్ని నీ ప్రాణంతో రక్షించే సైనికుడు ఆలు పెరగని పోరాటం చేసిన ధీరుడా శత్రువుల దాటికీ పెన్ను చూపని వీరుడా మా కోసం ప్రాణాలర్పించిన భరతమాత పుత్రుడా ఏమిచ్చి తీర్చగలం నీ రుణం నీ నుదుటిన వీర తిలకం దిద్దిన నిన్ను కన్న తల్లిదండ్రులకు యావత్ భారతావని సలాం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసారు ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్ నాయక్ ప్రధాన కార్యదర్శి పూల్ సింగ్ నాయక్, అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్, దుర్గాప్రసాద్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాన్ సింగ్, సంగారెడ్డి జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు వైద్యనాథ్, ఎక్స్ సర్వీస్ మెన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ దశరథ్ పెంటయ్య, సురేందర్, సంతోష్ ఖింలాల్, రవి, కవిరాం నాగరాజు శివాజీ, మల్లేశం, శ్రీకాంత్, యాదగిరి విగేష్, సుభాష్,రాజు తదితరులు పాల్గొన్నారు.