శ్రీ వెంకటేశ్వర జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి.
సత్యమేవ జయతే/హత్నూర :
హత్నూర మండలం సికంద్లాపూర్, వడ్డేపల్లి గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీ వెంకటేశ్వర జాతర ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిధుల పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతున్ని వేడుకోవడం జరిగిందన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మాయిని శ్రీకాంత్, మాణిక్య రెడ్డి, వీరేందర్, నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, గొల్ల కృష్ణ, యాదగిరి, మన్నె రమేష్, ఇంతకీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.