సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ప్ర : జల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీజేపీ లు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు (, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
బీసీ కులగణన అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ , బీజేపీ లు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కలపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించడానికే మోదీ బీసీనా.. కాదా..? అనే చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెర లేపారని ఆమె ఆరోపించారు.
రాహుల్ గాంధీది ఏ మతమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. మోదీ బీసీ అయితే మాకేంది.. ఓసీ అయితే మాకేంది..? అని ఆమె ప్రశ్నించారు. బీసీల జనాభాను కరెక్టుగా లెక్కించాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. పక్కా లెక్కలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బిల్లు పెట్టాలని, దాన్ని కేంద్రంలో బీజేపీ ఆమోదించాలని అన్నారు.
ఆ ప్రాసెస్ చేయకుండా నరేంద్ర మోదీ కులం గురించి, రాహుల్ గాంధీ మతం గురించి మాట్లాడుకుంటున్నారని కవిత మండిపడ్డారు. బీసీ బిడ్డలను మోసం చేయవద్దని హెచ్చరించారు. వంకర టింకర మాటలు మాట్లాడుతూ ప్రజలను రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తన 14 నెలల పాలనలో ప్రజలకు నరకం చూపిస్తోందని ఆరోపించారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు.
రాష్ట్రంలో కేసీఆర్ను తలుచుకోని గుండె లేదని కవిత అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే కేసీఆర్ను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. అందరి ఆశీర్వాదంతో, తన శక్తియుక్తులతో కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారని చెప్పారు.