Saturday, June 7, 2025
ads
HomeUncategorizedసర్కారు దవఖానలో గడికో రూల్ .. అక్కడికి వచ్చిన...

సర్కారు దవఖానలో గడికో రూల్ .. అక్కడికి వచ్చిన పేద రోగులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ సిబ్బంది ..

– ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు డల్‌
– గ్రామాల్లో అందని 24 గంటల వైద్యం సత్యమేవ జయతే – సంగారెడ్డి సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సక్రమంగా అందడంలేదు. ఎదో ఉందంటే ఉంది.. చూశామంటే చూశాం.. మందులు ఇచ్చామంటే ఇచ్చాం.. అన్న తీరుగా జిల్లాలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయి.
భవనాలు చూస్తే కార్పొరేట్‌ ఆస్పత్రులను తలపిస్తుంటాయి.. వైద్య చికిత్సలు చూస్తే కనీసం కూడా అందవు. వైద్యులు ఉంటే.. నర్సింగ్‌ సిబ్బంది ఉండరు. వీరిద్దరూ ఉంటే పరికరాలు ఉండవు. ఈ మూడు ఉంటే టెక్నీషియన్లు ఉండరు. అంతా బాగుంది అనుకుంటే వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండరు. ఒకవేళ వైద్యులు ఉన్నా నాడి పట్టేందుకు ముందుకురారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ దావఖానలో అత్యవసర వైద్యం అంతంత మాత్రంగానే అందుతుంది. దీంతో రోగులు, క్షతగాత్రులకు సకాలంలో సరైన వైద్యం అందక ప్రాణాలు హరీ అంటుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారులకు దూరంగా ఉండే ప్రాంతాల్లో అత్యవసర వైద్యం ఇప్పటికీ అందడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తే వైద్యులు, సిబ్బంది అత్యవసరంగా స్పందించి సేవలు అందించడంలో జాప్యం చేస్తుంటారని, సక్రమంగా చూడరని, సరైన రీతిలో సమాధానాలు ఇవ్వరని బాధితుల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణలు. ఈ కారణంగా ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రులు అంటేనే ఆమడ దూరం వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో అరకొరగా వస్తున్న వారికి అయినా సక్రమంగా సేవలు అందించాల్సిన అవసరం ఉన్నా.. నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

– డిజిటల్‌ ఓపీ.. మాయ

రోగులకు సక్రమంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డిజిటల్‌ ఓపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే జిల్లాలో పలు పీహెచ్‌సీల్లో ఇది అమలు కావడంలేదు. వాస్తవానికి డిజిటల్‌లోనే ఓపీ వివరాలతో పాటు రోగులకు అందిస్తున్న మందులను కూడా నమోదు చేయాలి. అయితే మొదట పెన్సిల్‌తో రోగుల వివరాలు రాసుకుని ఆ తర్వాత సిబ్బంది తమకు అనుగుణంగా డిజిటల్‌లో నమోదు చేస్తున్నారు. కొన్ని దగ్గర్ల రోగులను పరీక్షించకుండానే ప్రతి రోజు ఎంతో మందికి వైద్యసేవలు అందిస్తున్నట్లుగా సిబ్బంది డిజిటల్‌లో నమోదు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఓపీకి వచ్చే వారి వివరాలు తొలిగా ఓ రిజిష్టర్‌లో పెన్సిల్‌తో ఆధార్‌ నంబర్లతో కలిపి రాసుకుని ఆ తర్వాత డిజిటల్‌లో నమోదు చేస్తున్నారని పలువురు తెలిపారు. అయిన ఈ ఒపిలో పనిచేసే సిబ్బంది వచ్చిన వైద్యులతో అసభ్య భాషనూ వాడుతున్నారని పలువురు తెలిపారు.

– ఫోన్‌ చేస్తేనే డాక్టర్‌ వస్తారు

24 గంటలు వైద్యసేవలు అందించాల్సిన ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండరు. దీంతో రోగులకు సరైన వైద్యసదుపాయాలు అందడం లేదు. రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర వైద్యం కోసం ఎవరైనా వస్తే సిబ్బంది ఫోన్‌ చేస్తే తప్ప వైద్యులు రావడంలేదనే ఆరోపణలున్నాయి. ప్రధాన రహదారుల్లో, ఇతర మార్గాల్లో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను వైద్యం నిమిత్తం 24 గంటల ఆస్పత్రికి వచ్చినా సరైనా చికిత్సలు అందించేందుకు వైద్యులు ముందుకు రావడంలేదు. రాత్రి వేళల్లో అయితే అది కూడా అందదు. క్షతగాత్రుడ్ని చూడకుండానే పరిస్థితి విషమంగా ఉందంటూ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి కాని, సమీపంలోని ఏరియా ఆస్పత్రికి కాని రెఫర్‌ చేస్తుంటారు.

పలువురు ద్వార మాకు అందిన సమాచారం

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సక్రమంగా అందడంలేదు. ఎదో ఉందంటే ఉంది.. చూశామంటే చూశాం.. మందులు ఇచ్చామంటే ఇచ్చాం.. అన్న తీరుగా జిల్లాలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయి. అత్యవసర చికిత్సలు అందించాల్సిన సమయంలో కనీసం నాడి పట్టే వారు కూడా ఉండటంలేదు. అత్యవసర సేవలు అందించడంలో ఘోరవైఫల్యం చెందుతున్నారనే విమర్శలున్నాయి. సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, సిబ్బంది కొరత వంటి వాటితో పాటు వైద్యులు, సిబ్బందిలో నిర్లక్ష్యం కూడా రోగుల పాలిట శాపంగా ఉంది. రూ.కోట్లు వెచ్చించి అన్ని హంగులతో గ్రామీణ ప్రాంతాల నుండి జిల్లా ఆసుపత్రికి వస్తున్నా నిరు పేదలకు, గర్భిణులకు కనీస వైద్యం కూడా అందడంలేదు. రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. అందుకు తగ్గ స్థాయిలో సేవలు అందడంలేదు. ఇక గ్రామాల్లో అయితే వైద్యం అందుబాటులోనే ఉండటంలేదు. అనారోగ్యసమస్యలతో ఆరోగ్యకేంద్రాలకు వస్తే డాక్టర్లు కనీసం చేతితో నాడిని సైతం పరిక్షించడంలేదనే విమర్శలున్నాయి. ఒకవేళ పీహెచ్‌సీలు ఉన్నా అక్కడకు వెళ్తే చికిత్సలు సకాలంలో సక్రమంగా అందుతాయా అంటే అనుమానమే. పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది ఎప్పుడు ఉంటారో వారికే తెలియదు. దీంతో వ్యయప్రాసలకు ఓర్చి అక్కడకు వెళ్లి నిరాశతో వెనుతిరిగే బదులు ప్రత్యామ్నాయాలే మేలన్న భావనలో ప్రజలు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు కూడా చేయడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందక ప్రతి ఏటా ఎన్నో ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ మాత్రమే అది కూడా అంతంతమాత్రంగానే సేవలు అందుతున్నాయి. అత్యవసరమై వైద్యసహాయం కావాలని వచ్చిన వారికి కనీస సమాచారం కూడా ఇచ్చే వారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండరు. ప్రభుత్వ ఆసుపత్రిలో సక్రమంగా అందని వైద్య సేవలపై తరచూ ఉన్నతాధికారులు సమీక్షల్లో ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకునే వారే లేరు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments