Friday, March 14, 2025
ads
Homeఆంధ్ర ప్రదేశ్వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు.. అసలు కారణమిదే..

వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు.. అసలు కారణమిదే..

సత్యమేవ జయతే – హైదరాబాద్ ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పటికే నాలుగు ఆదివారాలు రాగా మరో రెండు రోజులు కూడా సెలవు దొరకడంతో విద్యార్థులు తెగ సందడి చేస్తున్నారు.
వరుసగా రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు ఎగిరిగత్తేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు జనవరిలో భారీగా సెలవులు వచ్చాయి. నూతన సంవత్పరం, సంక్రాంతి పండుగలకు సెలవులు దొరకడంతో విద్యార్థులు సందడిగా గడిపారు. అయితే విద్యార్థులకు వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఫిబ్రవరిలో మరో రెండు రోజుల సెలవులు రానున్నాయి. ఇప్పటికే నాలుగు ఆదివారాలు రాగా మరో రెండు రోజులు కూడా సెలవు దొరకడంతో విద్యార్థులు తెగ సందడి చేస్తున్నారు. 4 ఆదివారాలతో పాటు శివరాత్రి పండుగ కూడా ఈ నెలలోనే వచ్చింది. వీటికి తోడు మరో రోజు కూడా సెలవు దొరకనుంది.

హాలీడేకు రీజన్ ఇదే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా స్థానాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఇందుకుగానూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్‌తో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా పాఠశాలలకు సెలవు వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్, స్కూల్ టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు ప్రభుత్వాలు సెలవు ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఈ నెల 27న కూడా సెలవు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 26న శివరాత్రి పండుగ రావడంతో ఆరోజు పబ్లిక్ హాలీడే ఇస్తారు. దీంతో ఆదివారాలతో పాటు మరో రెండు రోజుల సెలవులు కలిపి మొత్తం ఆరో రోజుల పాటు విద్యార్థులకు సెలవులు వచ్చినట్లు అవుతుంది.

ఏపీలోనూ ఎన్నికలు!

తెలంగాణతో పాటు ఏపీలో శివరాత్రి పర్వదినం తర్వాత రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికల జరగనుంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం స్థానాల్లోనూ ఎలక్షన్స్ నిర్వహిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments