రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్న ముస్లిం సోదరులు
సత్యమేవ జయతే కొండాపూర్
కొండాపూర్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా వద్ద సామూహిక ప్రార్ధన నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. మస్జిద్ వద్ద నుంచి కాలి నడకన వెళ్లి ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆప్యాయతంగా ఆలింగనం చేసుకున్నారు. స్థానిక సీఐ వెంకటేశం, ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డి ప్రార్థన స్థలం వచ్చి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ చైర్మన్ సాజిద్ పాషా, కమిటీ మెంబర్లు మహమూద్, మోయిన్, ఆసిఫ్, ఫేరోజ్, అహ్మద్, కొండాపురం మాజీ సర్పంచ్ ఎండి రుక్ముద్దీన్,గ్రామ పెద్దలు ముక్తార్ పటేల్, మైబలి, ముజీబ్, ల్యాఖాత్ అలి, ఖాజాపాషా, రఫీయొద్దీన్, తదితరులు పాల్గొన్నారు