యువకులు క్రీడల పట్ల ఆసక్తి చూపించాలి…
వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్…
పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి…
సత్యమేవ జయతే – గుమ్మడిదల
గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు పలుగు గోవర్దన్ రెడ్డి, ఆధ్వర్యంలో తమ సొంత నిధులతో వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయా మండలాల, గ్రామాలలోని కీడాకారులు పాల్గొన్నారు విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ డాక్టర్ సి అంజి రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొని విజేతలకు వారి చేతుల మీదుగా బహుమతూలు అందజేశారు ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి అంజిరెడ్డి మాట్లాడుతూ.. యువకులు ప్రస్తుత ఆధునిక యుగంలో క్రీడాల పట్ల ఆసక్తి కలిగి తమకు నచ్చిన క్రీడాలలో పాల్గొని మానసికంగా శరీరకంగా ఉల్లాసం పొందాలని సూచించారు ఉగాది పండగ సందర్భంగా క్రీడాలను ఏర్పాటు చేసిన పలుకు గోవర్ధన్ రెడ్డిని అభినందించారు ప్రథమ బహుమతి గుమ్మడిదల ద్వితీయ బహుమతి వీరారెడ్డిపల్లి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రతాప రెడ్డి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అంజి రెడ్డి, మండల అధ్యక్షులు ఐలేష్, మాజీ మండల అధ్యక్షులు నర్సంపల్లి రాజిరెడ్డి, బొల్లారం బిజెపి టౌన్ ప్రెసిడెంట్ ఆనంద్ కృష్ణా రెడ్డి, ఆర్గనైజర్ కరాటే మాస్టర్ సంజీవ, బిజెపి బూత్ అధ్యక్షులు కార్యకర్తలు క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.