Saturday, June 7, 2025
ads
Homeఆరోగ్యంముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీ...

ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీ రామ్


ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీ రామ్

కంది మండల కేంద్రంలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ సామూహిక ప్రార్ధన నిర్వహించారు. ముస్లిం సోదరులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. వచ్చే భక్తులకు త్రాగునీటి వసతి కల్పించడం జరిగింది, కంది గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు శ్రీరామ్ గారు ముస్లిం సోదరులకు ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. శ్రీరామ్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పండుగ మంచిగా జరుపుకోవాలని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని అందరం కలిసి మెలిసి ఉండాలని తెలియజేశారు. అంతేకాకుండా ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉందని, ముస్లిం సోదరులకు, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కింగ్స్ ఫ్యామిలీ దాబా యజమాని ఎండి సిరాజోద్దీన్, మతీన్ ఖురేషి, మహబూబ్ ఖురేషి, నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments