Thursday, June 5, 2025
ads
Homeగాడ్జేట్స్బీఆర్‌ఎస్‌ కార్యకర్త మృతి పట్ల ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌...

బీఆర్‌ఎస్‌ కార్యకర్త మృతి పట్ల ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సంతాపం

సత్యమేవ జయతే – కొండాపూర్ కొండాపూర్ : కొండాపూర్‌ మండలం గంగారం గ్రామానికి చెందిన జంగిలి ప్రేమ్‌కుమార్‌ గంగారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అయితే ప్రేమ్‌కుమార్‌ శనివారం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రేమ్‌కుమార్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని.. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా నిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తనయుడు చింతా సాయినాథ్‌ ప్రేమ్‌కుమార్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రేమ్‌కుమార్‌ పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తమ కార్యకర్త మృతి చెందడం చాలా బాధాకరమని చింతా సాయినాథ్‌ పేర్కొన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.
బీఆర్‌ఎస్‌ పార్టీ పరంగా కార్యకర్త కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. చింతా సాయినాథ్‌ వెంట మండల పార్టీ అధ్యక్షుడు విఠల్‌, మాజీ సర్పంచ్‌ నర్సింహులు, మాజీ ఎంపీటీసీ అర్చన అంజిరెడ్డి గ్రామస్తులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments