సత్యమేవ జయతే _ కల్హేర్
కల్హేర్ మండల కేంద్రం కొత్తచెరువు తాండకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరిసింగ్ గారిని నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
సంఘటన స్థలానికి గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి చేరుకొని హరి సింగ్ టిఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడే వ్యక్తి అని ఆయనను రాజకీయ కక్షపూరితంగానే హత్య చేశారని చెప్పారు.
హత్యకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని అలాగే హత్యకు ప్రోత్సహించిన వారిని కూడా వెంటనే శిక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి నియోజకవర్గంలో అనేక హత్యలకు పాల్పడుతున్నారని ఇది హేయమైన చేయాలని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే వెంట..
తాజా మాజీ జెడ్పిటిసి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ ఎంపీపీ జలంధర్, మాజీ సర్పంచ్లు బాలయ్య, గణపతి, మాజీ ఎంపీటీసీలు సంగప్ప, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సాయిలు, నాయకులు నరసింహ గౌడ్, పండరి, ప్రభు గౌడ్, లక్ష్మణ్ నాయక్, బాలయ్య తదితరులు ఉన్నారు.