సత్యమేవ జయతే/హత్నూర:
రంజాన్ పండగను ముస్లింలు హత్నూర మండలం వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన దుస్తులు ధరించి చిన్నా పెద్దా తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం గతించిన తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ వేడుకలలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్యంగా హాజరై రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రమశిక్షణ,దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.