ఏప్రిల్ 1 తేదీ వరకు మాత్రమే చివరి రోజు కావడంతో ఆధార్ కేంద్రానికి భారీగా క్యూ కడుతున్న జనాలు
సత్యమేవ జయతే- కొండాపూర్
కొండాపూర్ మండల కేంద్రంలో ఈనెల 17వ తేదీన కొండాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి FINO PAYMENTS BANK ముందు నిర్వహించినటువంటి ఆధార్ కేంద్రం ఏప్రిల్ ఒకటి తేదీ చివరి తేదీ కావడంతో ఆధార్ కేంద్రానికి జనాలు భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. చిన్నపిల్లల ఆధార్ కార్డులు మొబైల్ నెంబర్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్లు ఫోటో అప్డేట్లు, ఫోన్ నెంబర్లు అప్డేట్లు వంటి అనేక రకాల సేవలు అందించడంతో ఇన్ని రోజులు మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజల ఆధార్ కార్డులలో ఉన్నటువంటి తప్పులను ఈ నెల 17వ తేదీ నుంచి ఏర్పాటు చేసిన క్యాంపులో చాలామంది తమ ఆధార్ కార్డుల లోని తప్పులను బ్యాంకులో సేవలు అందిస్తున్న ఆధారు కేంద్రం నందు సరిచేసుకుని సంబర పడుతున్నారు, ఎన్ని రోజులు సదాశివపేట సంగారెడ్డి పట్టణాలు తిరిగి నాకు కూడా అప్డేట్లు కావడం కాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని ఇక్కడ ఆదర్శవ కేంద్రం ఏర్పాటు చేయడం వలన చాలా మేలు జరిగిందని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా కొండాపూర్ మండల కేంద్రంలో ఆధార్ అప్డేట్లు చేసుకోలేని వారు ఉంటే వెంటనే FINO PAYMENTS BANK నందు ఆధార్ సేవ కేంద్రంలో సమస్యలు పరిష్కరించుకోవాలని సంగారెడ్డి రీజినల్ మేనేజర్ రవీందర్ తెలిపారు.
FINO PAYMENTS BANK కొండాపూర్ బ్రాంచ్ నందు గోల్డ్ లోన్లు వెహికల్ ఇన్సూరెన్స్ లు ప్రారంభం. ఆసక్తి ఉన్నవాళ్లు ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతున్న వారు తమ బ్యాంకులో గోల్డ్ లోన్లు కూడా ఇస్తున్నామని గోల్డ్ లోన్లు కావాలనుకునే వారు బ్రాంచ్ని సంప్రదించగలరని అదేవిధంగా కారు ఇన్సూరెన్స్ బైక్ ఇన్సూరెన్స్ లు కూడా చేస్తున్నామని బ్యాంకు నిర్వాహకుడు జే భాస్కర్ తెలిపారు. అదేవిధంగా FINO PAYMENTS BANK కొండాపూర్ బ్రాంచ్ నందు స్టూడెంట్ అకౌంట్లు 18 సంవత్సరాలు దాటిన వారికి కూడా అకౌంట్లు పాస్బుక్కులు ఏటీఎంలో కూడా ఇస్తున్నామని పీఎం కిసాన్ డబ్బులు రాని వాళ్ళు కూడా ఇందులో అకౌంట్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ బ్యాంకు బ్రాంచ్ నందు అకౌంట్ లో డబ్బులు పడతాయని బ్రాంచ్ నిర్వాహకుడు జె.భాస్కర్ తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అకౌంట్లు లేని వారు కూడా నూతనంగా కొత్త అకౌంట్లు కూడా తీసుకోవాలని కోరారు.