సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : పాకిస్థాన్ మరోసారి అణ్వాయుధాలను తెరమీదికి తెచ్చింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) సమావేశం కావాలని ఆదేశించారు.
ఎన్సీఏ అనేది పాకిస్థాన్ రక్షణకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ. అణ్వాయుధాలు ప్రయోగించాలన్నా ఈ కమిటీ ఆమోదం తప్పనిసరి. ఉద్రిక్తతల సమయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించడంతో అణ్వాయుధాల వినియోగంపై నిర్ణయం తీసుకుంటారని వార్తలు గుప్పుమన్నాయి. అమెరికాతో చర్చల అనంతరం పాకిస్థాన్ యూటర్న్ తీసుకున్నది. ఎన్సీఏ సమావేశాన్ని ‘తూచ్’ అనేసింది. అసలు సమావేశం ప్రతిపాదనే లేదని పాక్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ పేర్కొన్నారు.